మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దుర్గయ్య (30)అనే వ్యక్తి బతుకుదెరువు కోసం రాయచూర్ నుంచి వచ్చి శాంతి నగర్లో నివాసముంటున్నారు.అయితే దుర్గయ్యకు మతి స్థిమితం లేదని ఈ క్రమంలోనే ఉరి వేసుకొని మృతి చెందాడని, గతంలో కూడా అతను చనిపోవడానికి యత్నించాడని స్థానికులు చెబుతున్నారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు.