కీసర, ఆగస్టు : కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంల ద్వారా మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న మొత్తం 72 మందికి చెక్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల్లో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంలు నెంబర్వన్గా నిలుస్తున్నాయని, ఈ స్కీంలతో నిరుపేదల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకోవడంతో వారికి ఎంతగానో ఆసరాగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా పెళ్లిలు చేసుకొంటున్న ఆడపడుచులకు మన సీఎం కేసీఆర్ మేనమామలాగా ముందు ఉండి నడిపిస్తున్నాడన్నారు. ప్రతి నిరుపేదలకు ఈ పథకం ద్వారా ఏదో రకంగా ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటుందన్నారు. మన సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రతి పథకం బడుగు, బలహీన వర్గాల కోసమే పనిచేస్తుందన్నారు. ఇక దళితబంధు పథకం కూడా వస్తుందని, ఈ పథకం ద్వారా దళితుల జీవితాల్లో మార్పులు రావడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, మండల తహసీల్దార్ గౌరివత్సల, ఎంపీడీవో పద్మావతి, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు నాయకపు మాధురి వెంకటేశ్, తుంగ ధర్మేందర్, పుట్ట రాజుముదిరాజ్, పిడిచెట్టి పెంటయ్య, సుంకరి కవితజైహింద్రెడ్డి, గరుగుల ఆండాలుమల్లేశ్, ఆకిటి మహేందర్రెడ్డి, మోర విమలనాగరాజు, కౌకుట్ల గోపాల్రెడ్డి, సత్తమ్మ, ఎంపీటీసీలు తటాకం నారాయణశర్మ, పండుగ కవితశశికాంత్, మంచాల కిరణ్జ్యోతి, కందాడి ప్రమీలఅమరేందర్రెడ్డి, జూపల్లి వెంకటేశ్, సింగిరెడ్డి వెంకట్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్రెడ్డిలతో పాటు పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.