దుండిగల్, ఆగస్టు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ,బౌరంపేట పరిధిలోని శ్రీశ్రీశ్రీ బంగారుమైసమ్మ ఆలయ వార్షిక వేడుకలల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంభీపూర్రాజును ఆలయకమిటీ సభ్యులు మంగళవారం వేర్వేరుగా కలిసి ఆహ్వానపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు,16వ వార్డు కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డిలతోపాటు ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.