కీసర, ఫిబ్రవరి 6 : అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని కీసర పోలీసులు స్వాధీనం చేసుకొన్న సంఘటన నాగారంలో చోటుచేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కీసర పోలీసుస్టేషన్ పరిధి సింహపురి కాలనీలో రేషన్ బియ్యం నిల్వచేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు.
తనిఖీలో సుమారు 6 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. యాదాద్రి జిల్లా మల్కాపురం గ్రామానికి చెందిన గుగులోతు జగన్ను (45) అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది రూపాయలకు కిలో చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసి రూ. 20 రూపాయలకు అమ్ముతున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.