బోడుప్పల్, జూన్26 : ప్రజల మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారన్నారు.
ఆదివారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగరపరిధి 28వ డివిజన్లోని సాయి ఎంక్లేవ్ కాలనీలో రూ.40లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులు, రూ.39 లక్షలతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తుందన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ చీరాల నర్సింహతో కలిసి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు బింగి జంగయ్యయాదవ్, చందర్గౌడ్, సుమన్నాయక్, కో ఆప్షన్ సభ్యులు దత్తాత్రేయశాస్త్రీ, రంగబ్రహ్మన్న, నాయకులు శేఖర్రెడ్డి, చక్రపాణి,కృపాసాగర్, యాదగిరి, వెంకటేశ్యాదవ్, రాములు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.