బోడుప్పల్, ఆగస్టు : ఆగస్టు 15నుంచి రైతులకు రుణమాఫీ వర్తింప చేయడం పట్ల బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50వేల లోపు పంట రుణాలను మాఫీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
దీంతో రాష్ట్రంలో నెలాకరుకల్లా 6లక్షల మంది రైతులకు నేరుగా రుణ విముక్తి లభించనున్నట్లు వారు పేర్కొన్నారు. రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ రైతుబంధు, రైతుబీమా పథకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందనిన్నారు.