సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దుండిగల్ 14.5 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను త్వరలో ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్తో కలిసి శుక్రవారం ఆయన పలు యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 14.5 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు సుమారు 800 టీపీడీఆర్డీఎఫ్ వినియోగించనున్నట్టు తెలిపారు.
ర్యాంపు, ఆర్డీఎఫ్ టైపింగ్ హాల్ పిట్ టర్బైన్ జనరేటర్, మాస్టర్ కంట్రోల్ రూం బాయిలర్, బూడిద పిట్ ఎఫ్సీజీ ఎస్ చిమ్నీ, ఏసీసీ, స్విచ్ యార్డ్ యూనిట్లను పరిశీలించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు అన్ని అనుమతులు వచ్చాయన్నారు. ప్లాంట్కు సంబంధించిన స్టిచ్చింగ్ స్టేషన్, కంట్రోల్ రూమ్ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్లాంట్ను చార్జ్ చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను, ఏజెన్సీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎంఎస్ కోటేశ్వర రావు, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, రీల్ డైరెక్టర్ వి.ఎస్.వెంకటేశన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శాస్త్రీ, తోట కృష్ణారావు, హెచ్ఐఎంఎస్డబ్ల్యూఎల్ లిమిటెడ్ ప్రాజెక్ట్ హెడ్, బీజీజీ హెడ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.