దుండిగల్, మే 23: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లోని పలు సమస్యలను వారు ఎమ్మెల్సీకి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ రాజు.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, పలు ప్రాంతాల్లో జరగబోయే శుభ కార్యాల్లో పాల్గొనాలని పలువురు ఆయనకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.