దుండిగల్ : నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు శుక్రవారం శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు తమ సమస్యలను చెప్పుకుని పరిష్కరించాలని విన్నవించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించడమేగాక, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో జరగబోయే శుభకార్యాల్లో, వేడుకల్లో పాల్గొనాలని పలువురు రాజును కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.