ఘట్కేసర్: ఘట్కేసర్ మున్సిపాలిటీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్థానిక మహంకాళీ, పోచమ్మ, మైసమ్మ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లకు తీసుకొచ్చిన నైవేద్యాన్నిసమర్పించారు. కరోన నిబంధనలను పాటిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి బోనాలమొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా స్థానికంగా భక్తులు రాకపోకలు, ఆలయాల వద్ద మైకు చప్పుళ్లతో పండుగ సందడిగా కనిపించింది. మున్సిపాల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, కృపానందం ఆలయాల్లో అమ్మవార్లను దర్శించికొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.