అల్లాపూర్,ఏప్రిల్12 : ఈ నెల 20వ తేది నుంచి ప్రారంభమయ్యే కూకట్పల్లి రామాలయం పునఃప్రతిష్ట మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌక్యరం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం జహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కలిసి ఎమ్మెల్యే రామాలయ పునః ప్రతిష్ట మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. తాగునీరు, భోజన వసతి వంటి సౌకర్యాల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాంతారావు, కూకట్పల్లి ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు తదితరులు ఉన్నారు.