జీడిమెట్ల, జులై 18 : చింతల్ కల్లు కంపౌండ్లో నాలుగు రోజుల క్రితం మద్యం మత్తులో ఓ మహిళపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు జీడిమెట్ల పోలీసులు తరలించారు. జీడిమెట్ల సీఐ ఎం.పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ గ్రామం జయరాంనగర్కు చెందిన సాయిలు, షాపూర్నగర్ సంజయ్గాంధీనగర్కు చెందిన షేక్ యూసుఫ్ (25) స్నేహితులు.
యూసుఫ్ సాయిలు ఇంటికి తరచూ వచ్చి పోతుండేవారు. ఈ క్రమంలొఓ ఈ నెల 15వ తేదీ రాత్రి యూసుఫ్ జయరాంనగర్లొని సాయిలు ఇంటికి వచ్చి రాత్రి కావడంతో తాగి అక్కడే పడుకున్నాడు.
శనివారం ఉదయం భార్య, భర్తలు ఉమా (30) , సాయిలు. వీరు వారి వారి పనులపై బయటకు వెళ్లారు. ఈ క్రమంలో యూసుఫ్ ఇంట్లోని విలువైన మొబైల్ను ఎత్తుకెళ్లాడు. ఈ విషయమమై షేక్ యూసుఫ్ను ప్రశ్నించడానికి సాయిలు భార్య ఉమ చింతల్ బస్టాప్ వద్ద ఉన్న కల్లు కంపౌండ్ వద్ద వచ్చింది.
అతని వద్ద నున్న మొబైల్ ఫోన్ను తీసుకోవడంతో కోపంతో రగిలి పోయిన షేక్ యూసుఫ్ తన వద్ద ఉన్న బ్లేడుతో ఉమా మెడపై తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే భాదితురాలిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.