మేడ్చల్ మల్కాజిగిరి : రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి ఐడీపీఎల్ జంక్షన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీపీఎల్ జంక్షన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ట్రాఫిక్ సమస్యను తొలంగించి ప్రజలకు సులభమైన ప్రయాణాన్ని కల్పించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను మరో చోటుకు బదిలీ చేయాలని అధికారులకు ఆదేశించారు.
కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, జీహెచ్ఎంసీ ఈఈ డి.గోవర్ధన్గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్రెడ్డి, టౌన్ ప్లానింగ్ డీసీపీ సాంబయ్య, జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ డీఈ రఘుపతిరెడ్డి, విద్యుత్ ఏడీఈ సతీష్, ట్రాఫీక్ సీఐ చంద్రశేఖర్, డీఈఈ శీరిష, తదితరులు పాల్గొన్నారు.