Milk packets | గత కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయమవుతుండపై సదరు పాల వ్యాపారికి అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. ఓ యువకుడు పాల ప్యాకెట్లను దొంగలిస్తున్నట్లు తేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే..మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల విలేజ్లో విష్ణువర్ధన్ రెడ్డికి మిల్క్ షాప్ ఉంది. ప్రతి రోజు ఉదయం పాల వ్యాన్ వచ్చి అతడి షాప్ ముందు పాల ప్యాకెట్స్ ఉన్న ట్రేలు పెట్టి వెళ్తుంటారు. అయితే కొద్ది రోజులుగా ట్రేలల్లో తేడాలు ఉండటాన్ని గమనించిన విష్ణువర్దన్ రెడ్డి సీపీటీవీ పుటేజీని పరిశీలించాడు. అందులో ఓ యువకుడు పాల దుకాణంలో ఓ యువకుడు గడిచిన నెలలో 10 సార్లకు పైగా తెల్లవారుజామునే పాల ట్రేలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ మేరకు షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీటీవీ ఫుటేజ్..!
మేడ్చల్లో పాల ప్యాకెట్లు దొంగలించిన యువకుడు
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల విలేజ్లో ఓ పాల దుకాణంలో గడిచిన నెలలో 10 సార్లకు పైగా తెల్లవారుజామునే పాల ట్రేలను ఎత్తుకెళ్తున్న యువకుడు
సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు
షాపు నిర్వాహకుడు… pic.twitter.com/TIOOU3PHJ6
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026