అనంతపురం : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు( Chandra babu ) , విపక్షంలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ( YS Jagan ) పై పలు ఆరోపణలు చేశారు. అనంతపురంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరూ రాయలసీమ ప్రాంత వాసులే అయినప్పటికీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించలేదని ఆరోపించారు.
రెండు పార్టీలే ఏపీలో అధికారంలో ఉంటున్నాయని వాటికి ప్రత్నామ్నయంగా దసరా రోజున తాను పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవ పౌరుషాన్ని కాపాడుతానని ప్రకటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ నుంచి రెడ్లు మాత్రమే కాదని, చాలా మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు.
త్వరలో తన కూతురు టీవీ ఛానల్ పెడుతున్నారని, ఆ ఛానల్కు తనకు సంబంధం లేదని వెల్లడించారు. ఆ ఛానల్ న్యూటరల్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. తమ పార్టీ కనుమరుగయ్యే అవకాశం లేదని ఒక ప్రశ్నకు సమాదానమిచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ టీవీకే పార్టీ తరహాలో ఇక్కడి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.