న్యూఢిల్లీ: బ్రీత్లైజర్ పరీక్షలో జాప్యం చేసిన పైలట్లు, సిబ్బందిపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ విమాన ప్రయాణం తర్వాత నిర్దేశించిన రెండు గంటల వ్యవధిలోగా తప్పనిసరిగా బ్రీత్లైజర్ పరీక్ష చేయించుకోనందుకు నలుగురు పైలట్లతో సహా ఎనిమిది మంది సిబ్బందిని సస్పెండ్ చేసింది. (Breathalyser Test) ఆగస్ట్ 2న దుబాయ్-అమృత్సర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం అమృత్సర్లోని గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత రెండు గంటల్లోగా ఆ విమాన సిబ్బంది తప్పనిసరిగా పోస్ట్-ఫ్లైట్ డిక్లరేషన్కు హాజరు కావాల్సి ఉన్నది.
కాగా, ఆ విమాన సిబ్బందిలో కొందరు 35 నిమిషాలు ఆలస్యంగా బ్రీత్లైజర్ పరీక్షకు హాజరయ్యారు. విమానం ల్యాండ్ అయిన 2 గంటల 35 నిమిషాల తర్వాత తమ డిక్లరేషన్ను వారు సమర్పించారు. ఈ నేపథ్యంలో తమ సిబ్బంది పాల్పడిన ఈ ఉల్లంఘనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నివేదించింది. నలుగురు పైలట్లతో సహా ఎనిమిది మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు అందులో పేర్కొంది.
మరోవైపు గత నెలలో ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం భారీ కుదుపులకుగురైంది. ఆ పైలట్ గంజాయి సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణం తర్వాత నిర్దేశిత వ్యవధిలోగా సిబ్బందికి బ్రీత్లైజర్ పరీక్షలను విమానయాన సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని డీజీసీఏ ఆదేశించింది.