దుండిగల్,ఆగస్టు5 : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెడ్డి జడంగ్పేట్ గ్రామానికి చెందిన మిన్నపురం మహేష్(33) భార్య,పిల్లలతో కలిసి నిజాంపేటలో నివాసముంటున్నారు.
కూలీ పనులు చేసే మహేష్కు భార్యా రాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శుక్రవారం ఉదయం విద్యుత్ మోటర్ ద్వారా నీటిని పైకి తోడేందుకు వైర్ను మూడో అంతస్థుపై నుంచి కిందకు వేశాడు.ఈ క్రమంలో వైర్లు 11 కేవీ వైర్లపై పడటంతో విద్యుత్ ప్రసరణ జరిగింది.
దీంతో మహేష్ విద్యుత్ఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.