మేడ్చల్ మల్కాజిగిరి : మంత్రి కేటీఆర్ కుమారుడిపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తీన్మాన్ మల్లన్న తీరుకు నిరసనగా కేపీహెచ్బీ రోడ్ నెం-1 గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ కూకట్పల్లి నియోజకవర్గ యూత్ విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం మల్లన్నపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేశారు.
కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు శ్రీను, సాకేత్ రెడ్డి, సలీముద్దీన్, నరేంద్ర, నరేష్, విక్టర్, మస్తాన్ రెడ్డి, కిరణ్, చిక్కం వంశీ, డి. ప్రకాష్, లక్ష్మణ్, మోజేష్, దినేష్ ,దేవా, మహేష్, పవన్, గౌతమ్, సాయి, వంశీ యాదవ్ పాల్గొన్నారు.