రాయిలాపూర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
హంతకుడి రిమాండ్
మేడ్చల్, ఏప్రిల్ 20: డబ్బుల కోసం వ్యక్తిని హత్య చేసిన హంతకుడిని మేడ్చల్ పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడ్చల్ సీఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మండలం, నాగులూర్ గ్రామానికి చెందిన మాసని సత్యనారాయణ (45) ఈ నెల 14వ తేదీన మేడ్చల్ మండలంలోని రాయిలాపూర్ గ్రామ శివారులో హత్యకు గురైన సంగతి విదితమే. బంధువుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పలువురిని ప్రశ్నించిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నింగాని రజిత్కాంత్(22)ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.