శంకర్పల్లి జూలై 4 : ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ శివారులో గల ప్రగతి రిసార్ట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్ కు చెందిన అనితా రాజ్పుత్(30) భర్త రాజు రాజ్పుత్(38) ప్రగతి రిసార్ట్స్ కి 3 నెలల క్రితం బతుకుదెరువు కోసం వచ్చి కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు.
ఆదివారం భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి గొడవపడ్డారు. దీంతో మనస్థాపం చెందిన అనిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. భర్త రాజు ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.