మర్పల్లి, జూలై 1 : తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో పలు రకాల మొక్కలను నాటి వాటిని పోలీసులు వాటిని సంరక్షిస్తున్నారు. ఆసక్తి ఉంటే ఇంటి ఆవరణతో పాటు కార్యాలయాలను పూదోటలుగా మార్చవచ్చనే స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఇతర శాఖలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మొక్కలు పెరిగి పెద్దవై పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అలాగే మార్కెట్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం వద్ద నాటిన మొక్కలు పెద్దగా కావడంతో చల్లదనాన్ని ఇస్తున్నాయి.
అందరి సహకారంతోనే సాధ్యం : ఎస్సై అరుణ్కుమార్
గతంలో పనిచేసిన ఎస్సైలు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో పెద్దవిగా మారాయి. నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మొక్కలకు నీరు పడుతుండటంతో ఏపుగా పెరుగుతున్నాయి. రెండు చెట్లకు చుట్టూ దిమ్మెలు కట్టడంతోపాటు షెడ్డును నిర్మించాం. దీంతో ఫిర్యాదు దారులు సేదతీరుతున్నారు.