ధారూరు, అక్టోబర్ 16: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఘనమైన అభివృద్ధి జరుగుతున్నదని, గులాబీ గళమే తెలంగాణకు బలమని, పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో ధారూరు మండల పరిధిలోని ధారూరు స్టేషన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్, అవినాష్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కొత్తగడికి చెందిన పలు పార్టీల శ్రేణులు 80 మంది పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ధారూరు మండల నాయకులు, ఉద్యమకారులు ఉన్నారు.
యాచారం : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి తిరిగి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్శితులై మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు 100 మందికి పైగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, నాయకులు క్యామ మల్లేశ్, ప్రశాంత్కుమార్రెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మండలంలోని నందివనపర్తి గ్రామానికి చెందిన బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు, యాచారానికి చెందిన మాజీ ఎంపీటీసీ దశరథ, టీడీపీ సీనియర్ నాయకులు జోగు కృష్ణ, గడల శ్రీనివాస్, నారిమల్ల యాదయ్య, దేవరకొండ యాదయ్య, గంజి యాదయ్య తమ కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బాషా, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాద్నగర్ : సకల జనులు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం చౌదరిగూడలో పలువురు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడారు. ఎక్బాల్, మహమూద్, ఇస్మాయిల్, సమ్మద్ వంటి మైనార్టీ నేతలు పార్టీలో చేరడం సంతోషకరమని, పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులున్నారు.
శంకర్పల్లి : తెలంగాణ రాష్ర్టాభివృద్ది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం శంకర్పల్లి మున్సిపాలిటీ బుల్కాపూర్ వార్డుకు చెందిన 100 మంది బీజెపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కౌన్సిలర్ గోపాల్ ఉన్నారు.
మొయినాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మొయినాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్గౌడ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు పరమేశ్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ వచ్చేది కాదు.. చచ్చేది అని భావించిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీకాంత్, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
కడ్తాల్ : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం కడ్తాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడ్తాల్, సాలార్పూర్ గ్రామాలకు చెందిన యాదగిరి, రామస్వామి, కృష్ణ, కరుణాకర్, రాములు, అం జయ్య, లింగం, నర్సింహ, పెంటయ్య, రమేశ్, సిలారి లక్ష్మయ్య, జంగయ్య, నవీన్, వెంకటయ్యగౌడ్, గోపాల్, శివ, మహేందర్, రవి, శ్రీను, శ్రీకాంత్, లాలూనాయక్, మహేశ్, సురేశ్, గోపీనాయక్, రామచంద్రయ్య, మల్లేశ్, రాజీవ్తోపాటు మరో 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీలున్నారు.