ధారూరు, జనవరి 30: రాష్ట్ర అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నా యని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమ వారం బంట్వారం మండల పరిధిలోని బోపునారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు రవీందర్ రెడ్డి, లచ్చయ్య, తొర్మామిడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువనాయకులు డప్పు రాజు, బాబు, ప్రదీప్, ప్రేమ్కుమార్ వారి అనుచరులు 35మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.
ఎమ్మెల్యేకు వినతులు..
కాగా తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆర్పీల సంక్షేమ సంఘం(మెప్మా) తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్, తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ సంఘాల కార్మికులు వారి వారి సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
వికారాబాద్ మండలానికి చెందిన 59 మంది లబ్ధి దారులకు ఎమ్మెల్యే ఆనంద్ సోమ వారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్ర కళ, బీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.