వికారాబాద్, మే 13 : సమ్మెలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారం మధ్యా హ్నం 12 గంటల్లోగా విధులకు హాజరు కాని పక్షంలో వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా కొత్త వారిని నియమించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అనధికార గైర్హాజరు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శనివారం ఆయన సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధులకు హాజరైన వారిని మినహాయించి..
హాజరుకాని సెక్రటరీల జాబితాను సిద్ధం చేసి వారి స్థానంలో తాత్కాలిక నియామకాలను ఆదివారం సాయం త్రం లోపు చేపట్టాలని ఆదేశించారు. ఏ గ్రామాల్లోనేతే సెక్రటరీలు విధులకు హాజరు కాలేదో సదరు సెక్రటరీల స్థానంలో ఆ గ్రామాలకు చెం దిన డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని కొత్త సెక్రటరీలుగా తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని సూచించారు. గతం లో నిర్వహించిన రిక్రూట్మెంట్ ఆధారంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేయాలన్నారు.
అన్ని మండలాల్లోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల సూపర్వైజర్లు, ఎంపీవోలు, ఏపీవోలు సంబంధిత గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లతో సం ప్రదింపులు జరపాలన్నారు. ఆదివారం గ్రామసభలు నిర్వహించి తీర్మానం ప్రకారం ఎస్సీ స్థా నంలో ఎస్సీలకు, ఎస్టీ, బీసీ స్థానాల్లో అట్టి వారిని నియమించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు విజయకుమారి, అశోక్కుమార్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు.