రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో మక్కజొన్నల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సొసైటీ, డీసీఎంస్లు కొనుగోళ్లు చేపడుతున్నాయి. మొత్తం 10 కేంద్రాల ద్వారా మక్కలను సేకరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 786.50 క్వింటాళ్ల మక్కజొన్నలను అధికారులు కొనుగోలు చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు.
జిల్లాలో రబీ కాలంలో వరి, వేరుశనగ పంటల సాగు త ర్వాత స్థానం మొక్కజొన్నదే. ఖరీఫ్, రబీ కాలా ల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం వరి ప్రధానంగా పండించే పంట కాగా, ద్వితీయ స్థానంలో వేరుశనగ ఉన్నా.. సాగు విష యంలోకి వచ్చేసరికి రెండోస్థానంలో మొక్కజొన్నే ఉంటున్నది. యాసంగిలో వరి 52,947 ఎకరాల లో సాగవుతుందని అధికారులు అంచనా వేయ గా 46,324 ఎకరాల్లో సాగైంది. అలాగే వేరుశనగ 11,140ఎకరాలకుగాను 4,715 ఎకరాల లో.. మొక్కజొన్న 10,360 ఎకరాలకు గాను 8,100 ఎకరాలలో సాగైంది. యాసంగిలో వరి తర్వాత మొక్కజొన్న పంటే అధికంగా సాగవుతున్నది. జిల్లాలో మక్కల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దశలో వర్షాల కారణంగా మందకొడిగా సాగినా ఇప్పుడు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా కాస్తుండటంతో కల్లాల్లో మక్కలను ఆరబెట్టుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నది. దీంతో చురుగ్గా మక్కల సేకరణ జరుగుతున్నది. కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ హరీశ్ సైతం మక్కల కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ తహెమీనా తహెసీన్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీరికి తోడు డీసీఎంఎస్ సిబ్బంది, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లూ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
పది కేంద్రాల ఏర్పాటు..
జిల్లాలో పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలోని మొత్తం పది కేంద్రాల్లో ఈ నెల మొదటి వారంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనా.. నాలుగు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు ఊపందుకున్నా యి. క్వింటాలుకు మద్దతు ధర రూ.1,962 ఉన్న ది. పీఏసీఎస్-షాద్నగర్, కందుకూరు, మేకగూ డ, చేగూరు, తలకొండపల్లి సబ్ సెంటర్ (పడకల్), ఇంకా డీసీఎంఎస్-షాబాద్ కేంద్రాల్లో కొనుగోళ్లు షురూ కాలేదు. అధికారులు ఇప్పటివరకు పీఏసీఎస్-తలకొండపల్లి (వెలిజాల) నుంచి 177.5 క్వింటాళ్లు, పీఏసీఎస్-కొత్తపేట నుంచి 439 క్వింటాళ్లు, పీఏసీఎస్-కొందుర్గు నుంచి 126.5 క్వింటాళ్లు, పీఏసీఎస్-మహేశ్వరం నుం చి 43.5క్వింటాళ్లను కొనుగోలు చేశారు. మక్కలు సేకరించిన కొద్ది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతా ల్లో అధికారులను డబ్బులను జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 15,43,113.00 లక్షలు జమయ్యాయి. కొనుగోలు చేసిన మక్కలను 1573 గన్నీ బ్యాగుల్లో భద్రపర్చగా.. 439 క్వింటాళ్లను గోడౌన్లకు తరలించారు. ఇంకా మక్క ల కొనుగోలు కేంద్రాలు కొనుసాగుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
పారదర్శకంగా కొనుగోళ్లు
జిల్లాలోని మక్కల కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు పారదర్శకంగా సాగుతున్నాయి. మొక్కజొన్న సాగు ఖరీఫ్ సీజన్లో 62,136 ఎకరాలలో సాగు కాగా.. రబీలో కేవలం 8,100 ఎకరాలల్లో నే జరిగింది. అంటే, సాగు 54 వేల ఎకరాల వర కు తగ్గిపోయింది. రైతులు పండించిన పంట కొ నుగోలు బాధ్యతను నోడల్ ఏజెన్సీ అయిన మా ర్క్ఫెడ్కు అప్పగించారు. మార్క్ఫెడ్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సొసైటీ, డీసీఎంఎస్ల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిం ది. సేకరించిన మక్కలను నిల్వ చేసేందుకు అధికారులు ఇప్పటికే 20 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోడౌన్లను వినియోగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు దళారుల బెడద తప్పింది. మక్కల సేకరణకు మార్క్ఫెడ్ ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొనుగోళ్లను ఆన్లైన్ చేస్తుండటంతో మక్కల సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతున్నది. రైతుల వివరాలు ఇప్పటికే ఆన్లైన్లో నమోదై ఉండటం తో నకిలీ రైతులు ఇక కేంద్రాలకు వచ్చే ప్రసక్తే ఉం డదని జిల్లా అధికారులు రైతులకు భరోసా ఇస్తున్నారు.
వేగంగా కొనుగోళ్ల ప్రక్రియ
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మక్కజొన్న రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం. మక్కల కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహిస్తు న్నాం. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సేకరించి న మక్కలను నిల్వ చేసేందుకు గోడౌన్లు సిద్ధంగా ఉన్నాయి. మక్కలు సేకరించిన కొద్ది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం.
– తహెమీనా తహెసీన్, మార్క్ఫెడ్ రంగారెడ్డి జిల్లా మేనేజర్