రంగారెడ్డి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరి రోజు శుక్రవారం నామినేషన్ల జాతర సాగింది. ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలకు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులతోపా టు ఇతర పార్టీల నుంచి సైతం అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మె ల్యే అభ్యర్థులు మంచి ముహూర్తం చూసుకుని ఇదివరకే నామినేషన్లు వేసినప్పటికీ వారి తరఫు న పార్టీ నేతలు, కుటుంబసభ్యులు శుక్రవారం మరోసెట్ నామినేషన్లు వేశారు.
మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో 82 మంది అభ్యర్థులు 144 నామినేషన్లను దాఖలు చేశారు. అత్యధికంగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి 39 మంది అభ్యర్థులు 58 నామినేషన్లను దాఖలు చేయగా.. షాద్నగర్ నుంచి 24 మంది అభ్యర్థు లు 48 నామినేషన్లు, చేవెళ్ల నుంచి 19 మంది అభ్యర్థులు 38 నామినేషన్లను దాఖలు చేశారు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన ఉండగా..15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు రెబల్స్ బెడద పట్టుకున్నది. ఎన్నికలకు ముందు నుంచే కొనసాగుతున్న లొల్లి నామినేషన్ల పర్వం ముగిసినా కూడా సద్దుమణుగలేదు. ఇబ్రహీంపట్నం టికెట్ కోసం చివరివరకు పోరాడిన దండెం రాం రెడ్డి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రాం రెడ్డి కూడా నామినేషన్ వేశారు. దండెం రాంరెడ్డి నామినేషన్ వేయడం రంగారెడ్డికి తలనొప్పిగా మారింది.
షాద్నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా కాం గ్రెస్ పార్టీ శంకర్ను ప్రకటించి బీఫాం కూడా ఇచ్చింది. అయితే అదే పార్టీ నుంచి ఆలుగడ్డ ప్రవీణ్తోపాటు ఆయన భార్య ఇందిర కూడా నామినేషన్లు వేసి రెబల్గా ఉన్నారు. చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి భీంభరత్ అభ్యర్థిత్వా న్ని పార్టీ ఖరారు చేయగా..టికెట్ ఆశించి భంగపడ్డ సున్నపు వసంతం నామినేషన్ దాఖలు చేసి రెబల్గా ఉన్నారు. ఈనెల 15న నామినేషన్ల ఉపసంహరణ నాటికి రెబల్ అభ్యర్థులు తప్పుకోని పక్షంలో ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.