జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పలు శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయాల్లో శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
పలు చోట్ల శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ, మార్చి 8