హయత్నగర్ రూరల్ : అవుటర్ రింగ్రోడ్డుపై అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారామతిపేట వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ భారీ లారీ దగ్ధమైంది. సిమెంట్ మిక్సింగ్తో శంషాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికి పూర్తిగా దగ్ధమైంది. లారీ దగ్ధంతో ఉదయం ఓఆర్ఆర్పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు బావిస్తున్నారు. మంటలు అంటుకుని టైర్లు పేలిన శబ్దాలు పెద్ద ఎత్తున వినిపించాయని తెలిపారు. మరికొద్దిగా అయితే కల్వర్టు పైనుంచి లారీ బోల్తాపడేదని పేర్కొంటున్నారు.