పరిగి, ఫిబ్రవరి 19: పరిగి మండల పరిధిలోని సయ్యద్పల్లి గ్రామంలో ఆదివారం శివ పార్వతుల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య శివపార్వతుల కల్యాణం కనులపండువగా జరిగింది. పరిగి ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్రెడ్డి స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొనడంతోపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేదపండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనం త రం గ్రామ సర్పంచ్ వెంకట్రాంకృష్ణారెడ్డి, గ్రామస్తులు ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంక టయ్య, నాయకులు జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
భూ కైలాస్ ఆలయంలో …
తాండూరు రూరల్: తాండూరు మండలం,అంతారంతండాలోని భూ కైలాస్లో ఆదివారం వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం జరిగింది. ఆలయ నిర్వ హకులు శంకర్నాయక్, వాసునాయక్ పవర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శివపార్వతుల పల్లకీసేవ ముందు శివస్వాముల కత్తివిన్యాస ప్రద ర్శనలు ఆకట్టుకున్నాయి. సొరంగంలో వెలసిన ద్వాదశజ్యోతిర్లింగాలను దర్శిం చుకునేం దుకు ఆదివారం కూడా భక్తులు విచ్చేశారు. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో అగ్ని గుండ ప్రవేశాన్ని నిర్వ హించారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు అగ్నిగుండంలో నడుచు కుంటూ వెళ్ళారు.
జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి ప్రత్యేక పూజలు
బషీరాబాద్: మండల పరిధిలోని జీవన్గి కాగ్నానది ఒడ్డున వెలసిన మహా దేవలింగేశ్వరుడి జాతర ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్ల వారు జామున అగ్ని గుండం, పల్లకీ సేవా, సాయంత్రం పార్వతీపరమేశ్వరుల కల్యాణం, రథోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు. జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి శివ రాత్రి జాగరణలో భాగంగా మహాదేవలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, జాగరం చేశారు. తెల్లవారుజామున నిర్వహించిన అగ్నిగుండంకు నిప్పు వెలి గించారు. జాగర చేసిన భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటం నవనీత, రైతు బంధు సమితి అధ్యక్షుడు శంకర్రెడ్డి, గ్రామ పెద్దలు మాణిక్రెడ్డి, మునీం దర్రెడ్డి, వీరారెడ్డి, నర్సిరెడ్డి, హంపిరెడ్డి, మల్లికార్జున్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆనంద్ ప్రత్యేక పూజలు
ధారూరు: పరమశివుడి అను గ్రహంతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామ సమీపంలో వెలిసిన పరమేశ్వరుని గుట్టపై నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని, స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, నాయకులు అనంత్రెడ్డి, విజయ్కుమార్, నవీన్కుమార్, అంజయ్య, పాండు, కిశోర్, ప్రజా ప్రతి నిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రిక్షాకాలనీలో గల శివాలయంలో వికా రాబాద్ ఎమ్మెల్యే మల్లికార్జున స్వామిని పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఎమ్మెల్యే వెంట అనంత్ రెడ్డి, విజయ్ కుమార్, లక్ష్మణ్, యాదయ్య, కృష్ణా రెడ్డి, తదితరులు ఉన్నారు. జీవన్గి మహా దేవలింగేశ్వరుడి ఆలయంలో శనివారం సాయం త్రం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఘనంగా జరిగింది.
కొడంగల్ మండలంలో..
కొడంగల్: మండలంలోని చిట్లపల్లి గ్రామంలో సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామం లోని శివాలయంలో జాగరణ మహోత్సవంలో భాగంగా పార్వతీపరమేశ్వరుల కల్యా ణాన్ని నిర్వహించారు. అదేవిధంగా పట్టణ శివారులోని గాడిభావి శివాలయంలో శనివా రం రాత్రి అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించి ఆదివారం ఉదయం అన్నదాన కార్య క్రమాన్ని నిర్వహించారు. 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
దోమ: మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో సర్పంచ్ నర్సింహులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మల్లన్న స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్కుమార్రెడ్డి హాజరయ్యారు.
పూడూరు: పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో ఆదివారం ఉదయం 11గంటలకు శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది. సాయంత్రం స్వామి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు తీసిన అనంతరం మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసా దాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భజన భక్తులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.