వికారాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తాండూరు నియోజకవర్గంలో లోకల్ వర్సెస్ నాన్-లోకల్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పైల ట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మనోహర్రెడ్డి బరిలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ స్థానికుడు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్రెడ్డి పరిగి నియోజకవర్గంలోని కులకచర్ల మండలానికి చెందిన వాడు. దీంతో ప్రజలు స్థానికుడైన రోహిత్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఏ గ్రామానికెళ్లినా రోహిత్రెడ్డికి ఘనస్వాగతం పలుకుతూ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బు, ఇతరత్రా ప్రలోభాలను లోనుచేస్తున్నా.. తాం డూరు ప్రజలు మాత్రం సెగ్మెంట్ను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందు ఉంచిన స్థానికుడైన రోహిత్రెడ్డికే జై కొడుతున్నారు. మనోహర్రెడ్డి ఏ గ్రామానికి, ప్రాంతానికెళ్లినా ప్రజలు మొహం చాటేస్తున్నా రు. అతడికి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తుండడంతో పోటీలో ఉన్నందుకు నామమాత్రంగా ప్రచా రం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. అయితే డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు కొందరు నా యకులు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినా తాం డూరు ప్రజలు మాత్రం లోకల్ వ్యక్తి అయిన రోహిత్రెడ్డికే మా ఓటు అని స్పష్టం చేస్తున్నారు. తాండూరు ప్రజల్లో లోకల్-నాన్ లోకల్ అనే ఫీలింగ్ రావడంతో నియోజకవర్గంలో వార్ వన్సైడ్గా మారిపోయింది.
నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండేలా ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఐదేండ్ల కాలంలో ప్రభుత్వం నుంచి రూ. 3,318 కోట్ల నిధులను తీసుకొచ్చి పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ నిధుల్లో నియోజకవర్గాభివృద్ధి కోసం రూ.1672 కోట్లు, సంక్షేమానికి సంబంధించి ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, కంటివెలుగు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, చేపపిల్లల పంపిణీ, దళితబం ధు, బీసీబంధు, మైనార్టీ గురుకులాలు, గొర్రెల పం పిణీ తదితర సంక్షేమ పథకాల నిమిత్తం రూ.1,646 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
అభివృద్ధి పనులకు సంబంధించి తాండూరు పట్టణానికి అత్యధికంగా రూ.1,191 కోట్లు ఖర్చు చేయగా, తాండూరు మండలానికి రూ.236 కోట్లు, యాలాల మండలంలో రూ. 97.77కోట్లు, బషీరాబాద్ మండలంలో రూ. 68.18కోట్లు, పెద్దేముల్-కోట్పల్లి మండలాల్లో రూ. 78.54 కోట్లను వెచ్చింది. నియోజకవర్గానికి ప్రధానంగా ప్రభుత్వ నర్సింగ్, ఐటీఐ కాలేజీలు, ఇండస్ట్రియల్ పార్కు, వ్యవసాయ మార్కెట్, పాత తాండూ రు ఫ్లైఓవర్, ప్రధాన రోడ్ల విస్తరణ, ఆటోనగర్ నిర్మా ణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తదితర అభివృద్ధి పనులను మంజూరు చేయించిన రోహిత్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. మరోవైపు సెగ్మెంట్లోని అన్ని గ్రామాలు, తాండూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లు తదితర అభివృద్ధి పనులను చేపట్టారు.
ఇందులో ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.50 లక్షల చొప్పున.. మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకూ రూ.కోటి చొప్పున నిధులను కేటాయించారు. అయితే తాండూరు ప్రత్యేక అభివృద్ధినిధి కింద నియోజకవర్గ అభివృద్ధికి రూ.134 కోట్లు మంజూరు కాగా.. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రూ.25 కోట్ల నిధులు మంజూరు కాగా పనులు జోరుగా సాగుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు తాండూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 100 కోట్లు, తాండూరు పట్టణంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల నిమిత్తం రూ.37 కోట్లు, తాండూరులో మాతా, శిశు దవాఖాన నిర్మాణానికి రూ.16 కోట్లు, మైనార్టీ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.18 కోట్లు, నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి రూ.10 కోట్లు, బషీరాబాద్లో 30 పడకల దవాఖాన నిర్మాణానికి రూ. 10.60 కోట్లు, తాం డూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో కాగ్నా నదిపై చెక్డ్యాంల నిర్మాణానికి రూ.40 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.