షాబాద్, ఫిబ్రవరి 13 : ప్రభుత్వ నిధులతో మండలంలోని అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని కుర్వగూడలో రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. జడ్పీ చైర్పర్సన్, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సహకారంతో మండలానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి జిల్లాలోనే షాబాద్ను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బుయ్యని సంధ్యారాణి, ఎంపీటీసీ బంగ్రంపల్లి వనిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, తెలంగాణ జేఏసీ కో-కన్వీనర్ యాస మల్లారెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం శ్రీను, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్గౌడ్, వెంకటేశ్, పార్టీ నాయకులు పద్మ, రాము, ప్రభుదాస్, నరేశ్, పర్వతాలు, శివకుమార్, శ్రీనివాస్, శ్రీలత, నారాయణ తదితరులు పాల్గొన్నారు.