కందుకూరు, జనవరి 12 : జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతున్నది. కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో చిరుతపులి లేగ దూడపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందేమోనని ఆందోళణ చెందుతున్నారు.
రెండు రోజుల క్రితం యాచారం మండల పరిధిలోని నానక్నగర్ గ్రామ సమీపంలో మేక పిల్లపై దాడి చేసింది. ఈ సంఘటన మరువక ముందే పక్క గ్రామం సాయిరెడ్డి గూడ గ్రామానికి చెందిన ముద్ద రాంచంద్రం లేగ దూడపై దాడి చేసింది. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
స్థానిక సర్పంచ్ అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. చిరుత పులి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరతున్నారు.