కులకచర్ల : రెండు రోజుల క్రితం కులకచర్ల మండలం మంచికుంట తండా సమీపంలో రోడ్డు ప్రమదంలో పీరంపల్లి గ్రామానికి చెందిన ఆరు మంది విద్యార్థులను బుధవారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో పరామర్శించి ఒక్కొక్కరికి తక్షణ ఖర్చుల కోసం రూ. 4వేలు ఆర్థిక సాయం అందించారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం వైద్యం అందిస్తుందన్నారు.
విద్యార్థులు అందరూ త్వరగా కొలుకుని ఇంటికి వెళ్లాలని కోరుకున్నారు. విద్యార్థులకు ఏ ప్రమాదం లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. కార్యక్రమంలో కులకచర్ల జడ్పీటీసీ రాందాస్నాయక్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు పాల్గొన్నారు.