‘వచ్చే నెల 17వ తేదీతో వంద రోజుల గడువు ముగుస్తుంది.. అప్పటివరకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోతే వదిలి పెట్టేది లేదని.. బొంద పెట్టాల్సిందేనని కార్యకర్తలు, నాయకుల కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత లు పెట్టే కేసులకు భయపడొద్దని .. ఏ సమస్య వచ్చినా అండగా అంటామని అభయమిచ్చారు.’
రంగారెడ్డి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ)/తుర్కయంజాల్ : ఇది తాత్కాలిక విరామేనని, ఇక నుంచి విజయమేనని, రానున్న లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మన్నెగూడలోని వేద కన్వెన్షన్ లో మంగళవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్త ల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ హ యాంలో జరిగిన అభివృద్ధిని చూసి హైదరాబాద్వాసులు కాంగ్రెసోళ్ల మాయమాటల్లో పడలేదని, పొరుగున ఉన్న ఇబ్రహీంపట్నం ప్రజలు మాత్రం బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్న హస్తం పార్టీ మాటలను నమ్మి మోసపోయారన్నారు. ఎవరితో మాట్లాడినా..ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేని పాలనను ఊహించుకోలేకపోతున్నామని బాధపడుతున్నారని అ న్నారు. కోల్పోయింది అధికారమేనని, పోరాట పటిమ అలాగే ఉందన్నారు. రాబోవు రోజుల్లో ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటాలని పిలుపునిచ్చారు.
దొంగ మాటలపై నిలదీయాల్సిందే..
నోటికి వచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రైతు డిక్లరేషన్..యూత్ డిక్లరేషన్..ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ల పేరుతో మొత్తం 420 హామీలను ఇచ్చి. తంతే బూరలో పడ్డట్లు సీఎం కుర్చీలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి, రైతుభరోసా, ఆసరా పింఛన్లను చెల్లించేందుకు దాదాపుగా రూ. 70 వేల కోట్లు కావాలన్నారు. వచ్చే మార్చి 17తో వంద రోజుల గడువు ముగుస్తుందని, అప్పటివరకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ను వదిలి పెట్టేది లేదని.. బొంద పెట్టాల్సిందేనని పిలుపు నిచ్చారు. గుంపు మేస్త్రీ రేవంత్ మాటలను ఎవరూ నమ్మడం లేదని, ముఖ్యమంత్రి అంటే కూడా ఎవరికీ నమ్మబుద్ధి కావడం లేదన్నారు. కాంగ్రెస్లో జిల్లాకో ముఖ్యమంత్రి ఉన్నాడని, ఎవరి దుకాణం వారి దే..ఎవరి దందా వారిదేనని ఎద్దేవా చేశారు. తొమ్మిది నెలల్లోనే వాళ్లకువాళ్లే తన్నుకుని చస్తారని, కాంగ్రెస్లో ఉన్న సంస్కృతి ఇదేనని విమర్శించారు. కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ మూడు పుస్తకాలను ముద్రించి ప్రతి కార్యకర్తకూ పంపిణీ చేస్తున్నదని.. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. కరెంటు పోతే ప్రజలు కేసీఆర్నే గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90శాతం పనులను బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశామని, కేవలం కాల్వలను తవ్వితే నీరు ఇవ్వొచ్చని..ఆ తెలివి కూడా కాంగ్రెసోళ్లకు లేదని మండిపడ్డారరు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలన్నారు.
గెలుపునకు కసితో పని చేయాలి..
భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకునేందుకు పార్టీ శ్రేణులు కసితో పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి మంచి వ్యక్తి అని..నియోజకవర్గ ప్రజలు ఆయన్ను పోగొట్టుకోవడం బాధాకరమన్నారు. ఆయన కృషితో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో ఏర్పాటైన ఫాక్స్కాన్ కంపెనీతో త్వరలోనే 30 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయ న్నారు. గతంలో స్వల్ప మెజార్టీతో ఎంపీ సీటును కోల్పోయామని, ఈసారి భువనగిరి లోక్సభ సీటును గెలుచుకుంటే ఎంపీ ఉన్నాడన్న ధైర్యం ఈ ప్రాంత ప్రజలకు ఉంటుందన్నారు. కాంగ్రెస్ 420 హామీలను కార్యకర్తలు ఇంటింటికెళ్లి ప్రజలకు వివరించాలని.. పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు పెట్టే కేసులకు భయపడొద్దని .. ఏ సమస్య వచ్చినా గంటలోపే వచ్చి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృపేశ్, కౌన్సిలర్లు కల్యాణ్ నాయక్,రవీందర్రెడ్డి, కీర్తన, జ్యోతి, లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, సామ సంజీవరెడ్డి, సంపతీశ్వర్రెడ్డి, అమరేందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటమికి కుంగిపోవద్దు..
కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు కుంగిపోవద్దు. భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించుకోవాలి. ఇంటింటికెళ్లి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించాలి. ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల తీరు చూస్తుంటే సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిలా ఉన్నది.
-మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు..
బీఆర్ఎస్ హయాంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకా లు అందాయి. కానీ నేటి కాంగ్రెస్ పాలనలో అనుకూల వర్గాలకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందే దుస్థితి నెలకొన్నది. ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు.. అధినేత కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం సెగ్మెంట్ల అభ్యున్నతికి కేసీఆర్ ఎంతో కృషి చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
– సబితాఇంద్రారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే
శేరిలింగంపల్లి ప్రగతి ఘనత కేసీఆర్దే ..
రూ.10 వేల కోట్లతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభివృద్ధి చేశారు. ప్రస్తుతం సెగ్మెంట్ అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాను చూసినట్లుగా ఉందని చెబుతున్నారు. సాధ్యం కాని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రజాగ్రహానికి బలికావడం ఖాయం.
– అరికెపూడి గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు..
సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతల విషయంలో రాష్ర్టాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నంబర్వన్ స్థానంలో నిలిపారు. బీఆర్ఎస్ ఓటమిని రాష్ట్రంలోని ప్రజలతోపాటు ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా జీర్ణించుకోలే కపోతున్నారు. భువనగిరి స్థానాన్ని గెలిపించుకోవాలి.
-క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ పార్టీ
రాష్ట్ర నాయకుడు మాయమాటలు చెప్పి గెలిచారు.
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ప్రజలు ఆ పార్టీని గెలిపించారు. సాధ్యం కాని హామీలిచ్చారు. సీఎంగా కేసీఆర్ లేరు అనే విషయాన్ని ప్రజలు నమ్మలేకపోతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి.
-కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
పెట్టుబడి సాయం పంపిణీలో విఫలం..
బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిం ది. ముఖ్యంగా షాద్నగర్ లాంటి ప్రాంతాల్లో ఉచిత విద్యుత్తు సరఫరా తో అన్నదాతలు పంటలను సాగు చేసుకుని లాభాల బాట పట్టారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ హయాంలో 90 శాతం వరకు పూర్తయ్యాయి. కేవలం కాల్వలను తవ్వితే రైతులకు నీళ్లు అందుతాయి. అధికారంలోకి రాగానే అన్నదాతలకు రైతుబంధు పం పిణీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు గడుస్తున్నా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయడంలో విఫలమైనది.
-అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే