ఇబ్రహీంపట్నంరూరల్ : కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ కరోనా నివారణ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి టీకా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం మండల పరిధిలోని చర్లపటేల్గూడలో 100శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా టీకా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయన్న అపోహలకు ప్రజలు గురికావద్దన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కరోనా టీకా తీసుకునే విధంగా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇంటింటికీ సర్వే నిర్వహించి టీకాలు వేయాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో కొవిడ్ టీకాలు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం స్పెషల్డ్రైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ స్పెషల్డ్రైవ్ కార్యక్రమం ప్రతి గ్రామంలో 15 రోజుల పాటు నిర్వహించి వైద్యాధికారులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎమ్లు, అంగన్వాడీల ద్వారా ప్రతి ఒక్కరు టీకాలు వేసుకునేలా కృషి చేయనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సౌకర్యార్థం వైద్యరంగానికి పెద్దపీఠ వేస్తున్నారని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పేద ప్రజల ఆరోగ్యానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. నాడు కరోనాను రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రతి పౌరుడికి టీకా అందజేయాలనే సంకల్పంతో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 100శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి చర్లపటేల్గూడ గ్రామం నుంచి ప్రారంభించామని, ఇక్కడ పూర్తి చేసుకుని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించి అందరికి టీకా వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కరోనా టీకా వేసుకున్న తరువాత జ్వరం వస్తే ఆ వ్యాక్సిన్ పని చేస్తున్నట్టుగా ప్రజలు గుర్తించుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయన్న వారి మాటలు పట్టించుకోవద్దని తెలిపారు. టీకా వేసుకోవడం ద్వారా కరోనా తట్టుకునే శక్తి ప్రజలకు వస్తుందని, టీకా వేసుకోవడం ద్వారా కరోనాను జయించేందుకు వీలుంటుందని ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేందుకు ముందుకు రావాలన్నారు.