కోట్పల్లి : కోట్పల్లి మండలంలో నిర్మిస్తున్న అన్ని శాఖల కార్యాలయాల నిర్మాణపు పనులను బుధవారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడుతూ నిర్మాణం పనులను నాణ్యత లోపించకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చాకలి మల్లేషం కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యాన్ని చెప్పారు.
అనంతరం పార్టీ కార్యకర్త నూతన గృహ ప్రవేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నక్కల విజయలక్ష్మీ, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.