కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అంగడిరైచూర్ గ్రామానికి చెందిన ఆశమ్మకు సీఎంఆర్ఎఫ్ పథకం క్రింద రూ. లక్ష 50వేల ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి రోజుల్లో వైద్యం చాలా ఖరీదు అయిందని, ఆర్థికంగా వెనుబడిన వారు ఫీజులకు భయపడి పరీక్ష చేయించుకోకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నరని తెలిపారు. ఇటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం క్రింద ప్రభుత్వం వైద్య పరీక్షలకు నిధులను మంజూరు చేసి ఆదుకుంటున్నట్లు తెలిపారు.
నియోజవర్గ పరిధిలో ప్రస్తుతం 70మందికి రూ. 50 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించుకోకుండా సీఎంఆర్ఎఫ్తో ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో చిట్లపల్లి సర్పంచ్ వెంకట్రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్సింగ్నాయక్, మాజీ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి పాల్గొన్నారు.