కొడంగల్ : ప్రజారోగ్యాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో భరోసాను కల్పిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామానికి చెందిన వెంకటయప్పకు రూ. 2లక్షల 50వేల ఎల్వోసీ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేని వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించకునేందుకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని తెలిపారు.
నియోజకవర్గంలో అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరు చేయించి, ప్రజారోగ్యాలకు కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు లబ్ధిదారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములుతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.