కొడంగల్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే కని విని ఎరుగని విధంగా వినూత్న సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందిస్తూ.. అందరినీ ఆదరిస్తున్నడని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని హస్నాబాద్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చావిడిలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల గౌరవిస్తూ.. పుట్టిన బిడ్డ నుంచి వివాహాల వరకు ముఖ్యమంత్రి మహిళలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు.
ఆడపిల్ల పుడితే రూ. 13 వేలతో పాటు కేసీఆర్ కిట్, ఉచిత విద్య, వివాహాలకు రూ. లక్ష116 అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉత్సవాలను జరుపుకునేందుకు ఆయా పండుగల్లో కానుకలను అందిస్తున్నట్లు తెలిపారు. నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ.. వందల రకాల డిజైన్లతో మహిళలకు చీరను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఫకీరప్ప, సయ్యద్ అంజద్, పీఏసీఎస్ అధ్యక్షులు కటకం శివకుమార్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు చంద్రప్రకాశ్, కో-ఆప్షన్ సభ్యులు ముక్తార్, సీనియర్ నాయకులు సిద్ధిలింగప్పతో పాటు నాయకులు సాయిలు, సురేశ్, ఎంట్ల మల్లయ్య పాల్గొన్నారు.