కొండాపూర్, జనవరి 2: మెరుగైన పరిశోధనలు, శిక్షణ కొనసాగించేందుకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సికింద్రాబాద్లోని క్రిష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)తో ఎంఓయూ కుదుర్చుకుంది. కిమ్స్తో పాటుగా మరో మూడు సంస్థలు (కేఎఫ్ఆర్సీ)లు పరిశోధనల్లో తమ వంతు సేవలందించనున్నాయి.
ఎంఓయూ ద్వారా ఇరు సంస్థలలోని ఫ్యాకల్టీ మాస్టర్స్, డాక్టోరల్ (పీహెచ్డీ) విద్యార్థులకు బయోటెక్నాలజీ, మాలిక్యూలర్ బయోలజీ, క్యాన్సర్ బయోలజీ, రీజెనరేటివ్ మెడిసిన్స్, న్యూరాలజీ/ న్యూరోసైన్సెస్, కార్డియాలజీ, డయాగ్నసిస్ తదితర అంశాల్లో సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించనున్నారు. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం ప్రొఫెసర్ ప్రకాశ్బాబు కోఆర్డినేటర్గా వ్యవహరించనున్నారు. హెచ్సీయూ రిజిస్ట్రార్ డాక్టర్ దేవెశ్ నిగమ్, కేఎఫ్ఆర్సీ చైర్మన్ డాక్టర్ వి.భుజంగరావు, వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బీజేరావుల సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.