రంగారెడ్డి, నవంబరు 23 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతున్నది. అవసరమైతే 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు ఉచిత సలహ ఇస్తున్నారు. అప్పట్లో పగటిపూట 3 గంటలు, రాత్రి పూట 3 గంటలు మాత్రమే కరెంటు ఇచ్చేవారు. అది కూడా నాణ్యత లేకుండా గంటకోసారి విరామం ఇస్తూ సరఫరా చేసేవారు. దీంతో కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. దీంతో రైతులు అర్ధరాత్రి కూడా పొలాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో పాములు, పురుగులు కరిచి, కరెంట్ షాక్తో పోయిన ప్రాణాలకు లెక్కేలేదు. నీరు సరిగా పారక దిగుబడులు వచ్చేవి కావు.
అంతిమంగా తినడానికి తిండి గింజలు మాత్రమే దక్కేవి. ఫలితంగా ధాన్యం కుప్పలు ఉండాల్సిన చోట.. అప్పుల కుప్పలు పెరిగేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 24 గంటల ఉచిత కరెంటుతో బిందాస్గా బతికిన రైతులు.. కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆగమైపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక కాంగ్రెసోళ్లు చెప్పినట్లు బోర్లకు 10 హెచ్పీ మోటార్లను పెడితే బోర్లలో నీళ్లు కరువై అధోగతి పాలవ్వడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్పై మండిపడుతున్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడుతూ సాగును పండుగలా మార్చిన బీఆర్ఎస్కే మా మద్దతు అంటూ ముక్తకంఠంతో జిల్లా రైతాంగం పేర్కొంటున్నది.
కాంగ్రెస్ ఇస్తామన్న మూడు గంటల కరెంట్ వ్యవసాయానికి అస్సలు సరిపోదు. మూడు గంటలతో మూల కూడా తడువదు. రైతులు 10హెచ్పీ మోటర్లు కొనాలంటే లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. మళ్లీ అప్పుల పాలు కావాల్సిందే. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. రైతులంతా సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారు. ఓట్ల కోసం కాంగ్రెసోళ్లు అధికారంలోకి రావాలని మాయ మాటలు చెబుతున్నారు. రైతులెవ్వరూ ఆ మాయ మాటలు నమ్మరు. సీఎం కేసీఆర్ సారుకే అండగా ఉంటారు.
– ఎన్.లలిత, రైతు, బండరావిరాల, అబ్దుల్లాపూర్మెట్
మూడు గంటల కరెంట్తో రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయి నష్టపోయాం. రాత్రిపూట కరెంట్ మోటర్లు పెట్టడానికి పోయి పాము కాటుకు రైతులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. మళ్లీ కాంగ్రెస్కు అధికారం ఇచ్చి అలాంటి పరిస్థితి తెచ్చుకోలేం. 24 గంటల పాటు కరెంటు ఇస్తున్న కేసీఆర్ సారే మళ్లీ రావాలి. రైతుల మద్దతు బీఆర్ఎస్కే.
– ఎం.బీరయ్య, దామరిగిద్ద , రైతు, చేవెళ్ల టౌన్
వ్యవసాయానికి 3 గంటల కరెం టు ఇస్తానని కాం గ్రెస్ నాయకులు ప్రకటించడం ఎం తో దారుణం. ఈ కరెంటుతో వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. రైతులకు పం టలు పండించుకోవడానికి చాలీచాలని కరెంటుతో వ్యవసాయం కనుమరుగు అవుతుంది. కేసీఆర్ సార్ 24గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారు. ఆయన రైతులకు అండగా నిలవడంతోనే నేడు వ్యవసాయం వెల్లివిరుస్తున్నది. 3గంటల కరెంటిచ్చే కాంగ్రేసోడు మాకొద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు కావాలి.
– యాదగిరిరెడ్డి, ఇబ్రహీంపట్నం
వ్యవసాయానికి 3 గంటలు మాత్రమే సాలు అన్న కా్ంర గెస్ పార్టీని ఎన్నిక ల్లో బొందపెట్టాలి. 24 గంటలు ఉచి త విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలవాలి. బీఆర్ఎస్ వస్తేనే రైతు ప్రభుత్వం వచ్చినట్లు. సీఎం కేసీఆర్ మాత్రమే రైతుల గురించి ఆలోచిస్తారు. కారుకు ఓటేయాలి.. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. – పాముల నర్సింహులు,పెంజర్ల, కొత్తూరు కాంగ్రెస్ పాలనలో కష్టాలు పడినం.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక కష్టాలు పడినం. రాత్రి పూట బావు ల కాడికి పోయి మోటర్లు నడిపించేటోళ్లం. ఎంత కష్టపడి నీరు పారించినా కరెంటు మాటిమాటికి పోయి రావడంతో పారిన మడే మళ్లీ పారుతుండే. కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంటు తిప్పలు లేదు. కొంపతీసి మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే రైతులు అగమాగం అయితరు. ఎట్టి పరిస్థితులతో కాంగ్రెస్కు మాత్రం ఓటు వేయరాదు. సీఎం కేసీఆర్కే ఓటు వేసి గెలిపిస్తేనే రైతులు బాగు పడుతారు.
– జంగ రాములు, రైతు, జంగోనిగూడ, నందిగామ
3 గంటల కరెంట్తో ఎకరా భూమి కూడా సాగు చేయలేం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంటు ఇస్తుండడంతో రైతుల కష్టాలు తీరాయి. ఇప్పుడిప్పుడే రైతులు మూడు పూటల తిని సంతోషంగా ఉంటున్నారు. రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్లుంది.10 హెచ్పీ మో టర్లు వాడే పరిస్థితి రైతులకు లేదు. కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్మించి గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నది. రైతులు కాంగ్రెస్ను నమ్మరు. రైతులందరూ బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు.
– కందాడి లక్ష్మారెడ్డి, రైతు, రాగన్నగూడ, తుర్కయాంజాల్
మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుం దన్న కాంగ్రెస్ నాయకుల మాయ మాటలను రైతులు నమ్మరు. సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటుతో వ్యవసా యాన్ని పండుగలా చేసుకుం టున్నాం. కాంగ్రెసోళ్లు ఇస్తు న్న హామీలను ప్రజలు ఎవ రూ నమ్మడం లేదు. రైతులకు ఏం కావాలో తెలుసుకొని అడు గక ముందే అమలు చేస్తున్న సీఎం కేసీఆర్. తెలంగాణ రైతులందరూ సీఎం కేసీఆర్కు రుణ పడి ఉంటారు. – విట్టలయ్య, రైతు, రామన్నగూడ, చేవెళ్ల రూరల్ మళ్లీ తిప్పలు పడాల్సిందే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్ తిప్పలు పడాల్సిందే. రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గతం లో కరెంట్ కోసం చాలా ఇ బ్బంది పడ్డాం. రైతుకు మూ డు గంటల కరెంట్ సరిపో తుందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సరైందికాదు. ఆ పార్టీలు వచ్చేది లేదు… చేసేది లేదు… మళ్లీ బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయం. కేసీఆర్ సారుకే మా మద్దతు.
– దోనూరి గోపాల్, సాయిరెడ్డిగూడ, షాబాద్
వ్యవసాయానికి 3 గంటల కరెంటు ఇచ్చే కాం గ్రెస్ పాలన మాకొద్దు. 24 గంటల పాటు కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు కావాలి. కాంగ్రెస్ ప్ర భుత్వం వస్తే మన బతుకు లు ఆగమే. రాత్రి వేళ పొలా ల దగ్గర జాగారం చేయా ల్సిందే. ఆ కష్టాలు మాకొద్దు. ప్రాణాలు త్యాగం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ నాయకులు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రైతులకు భరోసా కల్పించే బీఆర్ఎస్ పార్టీ కావాలి.
– శ్రీకాంత్, శంకర్పల్లి
గత ఉమ్మడి పాలనలో నాయకులు వారి స్వలా భం కోసం పనిచేశారు. రైతులను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే వినియో గించుకున్నారు. రైతులు, ప్ర జల సమస్యలను పట్టించుకు నే వారు కాదు. తెలంగాణ ను సాధించి.. సీఎం కేసీఆర్ అయ్యాకే మా రైతుల కష్టా లు తీరాయి. కాంగ్రెస్ హ యాంలో కరెంటు సమస్యల తో చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్లీ ఆ కష్టాలు పడలేం. అయినా కాంగ్రెస్ వచ్చేదుందా?
సచ్చేదుందా? మేం బీఆర్ఎస్ వెంటే
ఉంటాం.
– సురేశ్యాదవ్, రైతు, ఎలికట్ట, ఫరూఖ్నగర్
కాంగ్రెస్ రైతులను ఆగం చేయాలని చూ స్తున్నది. 3గంటల కరెంట్తో పొలంలో ఒక మడి కి కూడా నీళ్లు పారవు. గతం లో రైతులను పట్టించుకోకుం డా ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ. మళ్లీ నమ్మితే రైతులు 10ఏండ్లు వెనక్కి వెళ్లడం ఖా యం. 10హెచ్పీ మోటర్లతో రైతులకు పనిలేదు. రైతును రాజును చేసింది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ ఓటుతో గుణపాఠం చెప్పాలి. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను
గెలిపించుకునేందుకు సిద్ధం కావాలి.
– భీక్నాథ్నాయక్, రైతు, దొంతికుంటతండా, షాద్నగర్టౌన్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పే మాటలన్నీ బోగస్. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు.. 10 హెచ్పీ మోటరు పెట్టుకోవాలనడం మూర్ఖత్వ మే. ఆ మోటరుకు దాదాపు రూ.లక్ష అవుతుంది. ఆ డ బ్బు రేవంత్ రెడ్డి ఇస్తాడా? గత కాంగ్రెస్ పాలనలో కరెం ట్ ఎప్పుడు వచ్చేదో.. ఎప్పు డు పోయేదో తెల్వకపోయేది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్ ఇవ్వడంతో ఆ సమస్య తీరింది. కాంగ్రెస్ను నమ్మి తే మళ్లీ మోసమే.. ఆ పార్టీతో అయ్యేదేముండదు
పోయ్యేదేముండదు.
– జంతుక కిరణ్,మున్సిపాలిటీ 5వ వార్డు, ఆమనగల్లు