రంగారెడ్డి : రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలోని పహిల్వాన్ చెరువు, చందనవెళ్లి పెద్ద చెరువులో 8లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ కొత్త రాష్ర్టాన్ని భవిష్యత్తులో భావితరాలకు ఉపయోగపడేలా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
మిషన్ కాకతీయ పనులు దేశానికే ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని చర్యలతో పూడుకపోయిన చెరువులను సీఎం కేసీఆర్ కోట్లాది నిధులతో పునరుద్ధరించారని ప్రశంసించారు.
బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహించి సబ్సిడీపై రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా మత్య్సశాఖ అధికారి సుకీర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, సర్పంచ్ ప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ కల్వకోల్ వెంకట్యాదవ్, నాయకులు జడల రాజేందర్గౌడ్, మంగలి సత్యం, అన్వర్, తొంట వెంకటయ్య, గణేశ్గౌడ్, ఇమ్రాన్, దయాకర్చారి తదితరులున్నారు.