షాబాద్, ఏప్రిల్ 30: చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబుయాదవ్ అన్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి, ప్రజలను మోసం చేసిన రేవంత్రెడ్డి మీద ప్రజలకు అపనమ్మకం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కొంతమంది నాయకులు పార్టీని వీడినంతా మాత్రన ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో అదునుకు రైతుబంధు వచ్చేదని, కల్యాణలక్ష్మి, రైతుబీమా వంటి పథకాలు సకాలంలో రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. షాబాద్ మండలం నుంచి కాసాని జ్ఞానేశ్వర్కు భారీ మెజార్టీ ఇస్తామని చెప్పారు. సమావేశంలో సర్దార్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, డైరెక్టర్లు సూద యాదయ్య, దేవేందర్రెడ్డి, నాయకులు యాదిరెడ్డి, బచ్చంగారి నారాయణరెడ్డి, పాండురంగారెడ్డి, రాంచంద్రారెడ్డి, పర్వేద నర్సింహులు, వెంకటేశ్గౌడ్, కారు చెన్నయ్య, ప్రతాప్రెడ్డి, రాజూగౌడ్, భూపాల్రెడ్డి, సుధాకర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, మునీర్, ఇనాయత్, నరేశ్ తదితరులున్నారు.
కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
మొయినాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబుయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా మొయినాబాద్ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం నక్కలపల్లి, ఎతుబార్పల్లి, తోలుకట్టా, సాయంత్రం కేతిరెడ్డిపల్లి, చాకలిగూడ, ఎన్కేపల్లి, జీవన్గూడ గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేదని, కాంగ్రెస్ పాలనలో కోతలు తప్పడం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఆ పార్టీ నేతలను నిలదీయాలన్నారు. అదే విధంగా ఎన్కేపల్లి, జీవన్గూడ గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కుమ్మరి రాము, కుమ్మరి శ్రీనరివాస్, బీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ప్రమీల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ సర్పంచ్లు శ్రీహరియాదవ్, స్పప్న, బీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి నర్సింహ, ఉపాధ్యక్షుడు జయవంత్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బిలాల్, మాజీ ఎంపీటీసీలు మాణిక్రెడ్డి, రవీందర్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు దారెడ్డి వెంకట్రెడ్డి, డప్పు రాజు, మీడియా సెల్ మండల కన్వీనర్ సుభాష్, నాయకులు అంజయ్యగౌడ్, వెంకటయ్య, ప్రవీన్రెడ్డి, రాఘవేందర్యాదవ్, రాజు, శంకర్, తిరుపతిరెడ్డి, డేవిడ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా మండల పరిధిలోని కప్పాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో పాటుపడే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉడుతల జలంధర్గౌడ్, దేవదాసు, వీరయ్య, మల్లారెడ్డి, యాదగిరిరెడ్డి, జంగిలి, శంకర్, శివ, శ్రీనివాస్, మల్లయ్య తదితరులున్నారు.
గ్రామాల్లో బీఆర్ఎస్ విస్త్రత ప్రచారం
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాలు, తండాలు, నియోజక వర్గం అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : ఊరెళ్ల, మొండివాగు గ్రామాల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, బీఆర్ఎస్ బీసీసెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు, మాజీ ఎంపీపీ బాల్రాజ్, సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు శేరి శివారెడ్డి, వ్యసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీల తదితరులు పాల్గొన్నారు.