హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుత ధరల ప్రకారం.. 2024-25లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,80,031 నుంచి 2025-26లో రూ.4,18,931కు చేరింది. 10.23 శాతం వృద్ధి నమోదు చేసింది. కర్ణాటక రూ. 4,33,326 ఆదయంతో మనకంటే ముందు ఉన్నది. 12.21 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక ఏపీ ఆదాయం 10.42 శాతం వృద్ధి రేటుతో రూ. 2,66,699 నుంచి 2,94,507కు పెరిగింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన తాజా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ నివేదికతో ఈ వివరాలు వెల్లడయ్యాయి.