వికారాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నది. సోమవారానికి ఏడోరోజుకు చేరుకున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన 42 ప్రత్యేక వైద్య బృందాలు 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేస్తున్నాయి. అవసరమైన వారికి కంటి అద్దాలతోపాటు మందులను వైద్యులు పంపిణీ చేస్తున్నారు.
అంతేకాకుండా గ్రామాల్లో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలకు అవగాహ న కల్పిస్తున్నారు. మండలాల నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం జిల్లాలో 6,559 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 1,044 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. మరో 501 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డరిచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో 13,976 మందికి పరీక్షలు
షాబాద్, జనవరి 30: కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో సోమవారానికి ఏడో రోజుకు చేరింది. దృష్టి లోపం నివారణకు.. అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. సోమవారం జిల్లాలో 80 వైద్య బృందాలతో 13,976 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కంటి పరీక్షల కోసం వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పరీక్షలు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను వైద్యసిబ్బంది ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. డీఎంహెచ్వోతోపాటు ఆయా డివిజన్ల వైద్యాధికారులు ప్రతిరోజూ కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు.
2,877 మందికి అద్దాలు పంపిణీ
జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో సోమవారం 13,976 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 2,877 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 2,741 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డర్ చేశా రు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కంటి వెలుగు శిబిరాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయి.
అంకితభావంతో పని చేయాలి
చేవెళ్ల రూరల్, జనవరి 30: కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది అంకితభావంతో పని చేస్తూ విజయవంతం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ దామోదర్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని హస్తేపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో వెంకటయ్య, హరిచంద్రనాయక్, వెంకటేశ్ బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.
యాచారం మండలంలో 263 మందికి ..
యాచారం, జనవరి 20: కంటి వెలుగు కార్యక్రమం మండలంలో విజయవంతంగా కొన సాగుతున్నది. సోమవారం మండలంలో 263 మందికి వైద్యులు నేత్ర పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ప్రియాంక పర్యవేక్షణలో 120 కం టి పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి కంటి అద్దాలను అందజేశారు. మరో 25 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా తులేఖుర్ధ్దులో డాక్డర్ మౌనిక ఆధ్వర్యంలో 143 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 15 మందికి అద్దాలను పంపిణీ చేసి.. మరో 31 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను బుక్ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ప్రియాంక మాట్లాడుతూ 18 ఏం డ్లు నిండిన ప్రతి ఒక్కరూ కం టి పరీక్షలు చేయించుకుని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల న్నారు. కార్యక్రమంలో తులేఖుర్ధు పంచాయతీ కార్యదర్శి లత, వైద్యులు స్వరాజ్యలక్ష్మి, శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ప్రైవేట్ దవాఖానలకెళ్లి చూపించుకునే ఆర్థిక స్థోమత లేక అలాగే తమ జీవితాలను వెల్లదీస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్ర భుత్వం ప్రవేశపెట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంలా మారింది. కంటి వెలుగు శిబిరాల్లో వైద్యులు ఉచితంగా ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి మందులు, అద్దాలను పంపిణీ చేస్తున్నారు. నాకు కూడా వైద్యులు కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి.. అందరినీ ఆదుకుంటున్నారు.
-గాజుల ఈశ్వర్, కోట్పల్లి గ్రామం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేయడం పేదలకు వరంలా మారింది. గతంలో ప్రైవేట్ దవాఖానలకెళ్లి చూపించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం మా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-బాలప్ప, బస్వాపూర్, బంట్వారం మండలం
కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి
మా గ్రామంలోని కంటి వెలుగు శిబిరంలో పరీక్షించిన వైద్యులు దృష్టి లోపం ఉందని గుర్తించి కంటి అద్దాలు ఇచ్చారు. వాటిని పెట్టుకుంటే నా కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. మా లాంటి నిరుపేదలకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడు తుంది. పుణ్యమ్మ, బస్వాపూర్ గ్రామం, బంట్వారం