షాబాద్, జనవరి 23: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తున్నది. ప్రభు త్వం నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకుని రూపాయి ఖర్చు లేకుండానే అద్దాలు, మందులను ఉచితంగా తీసుకెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 80 బృందాలతో కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో సోమవారం 15,544 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. ఉదయం 9 గంటలకే వైద్యబృందాలు శిబిరాలకు చేరుకుంటున్నాయి. ప్రజల ఆధార్కార్డు తీసుకుని పేర్లను ఎంట్రీ చేసుకుని కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న క్యాంపులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారితోపాటు, డివిజన్ స్థాయి వైద్యాధికారులు సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు. కార్యక్ర మం సక్సెస్ అయ్యేలా సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో15,544మందికి ..
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వ రం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో సోమవారం వైద్యులు 15,544 మందికి కంటి పరీక్షలు చేయగా వారిలో 5,950మందికి అద్దాలను పంపిణీ చేశారు. 2,939 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గతంలో కంటి సమస్యలతో ఎన్నో దవాఖానలు తిరిగినా సమస్య తగ్గలేదని.. సీఎం కేసీఆర్ తమ గ్రామాల్లోనే క్యాంపులు పెట్టి కంటి పరీక్షలు చేయించడం సంతోషంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 7,439 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 1,220 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 697 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
వికారాబాద్, జనవరి 23 : ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఉద్యోగులందరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ వంద రోజులపాటు కొనసాగనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విడుతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా కోర్టు కార్యాలయా ల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులకు కలెక్టర్ కంటి అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పాల్వన్కుమార్, ఉప వైద్యశాఖ అధికారి జీవరాజ్, వైద్య బృందం సభ్యులు పాల్గొన్నారు.
దూరం చూపు కనిపించేది కాదు
దూరం చూపు కనిపించక చాలా ఇబ్బంది పడ్డా. ప్రైవేట్ దవాఖానలకు వెళ్తామంటే డబ్బులు లేకపాయే. దీంతో ఇంటికి వచ్చే వారిని గుర్తు పట్టేదాన్ని కాదు. గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో వైద్యులు పరీక్షించి అద్దాలను ఇచ్చారు. ఇప్పుడు మంచిగా కండ్లు కనిపిస్తున్నాయి.
-వనయాంబ, వికారాబాద్
కొత్త అద్దాలు ఇచ్చారు
సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. పేదలు కంటి సమస్య ల్లేకుండా ఉండేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నది. నాకు కంటి చూపు మసకబారి కనిపించేది. దీం తో దూరం వస్తువులు కనిపించేవి కాదు. మా గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంపులో వైద్యులకు చూపించుకోగా కంటి పరీక్షలు చేసి కొత్త కంటి అద్దాలు ఇచ్చారు.
-లక్ష్మమ్మ, చిట్యాల్, పరిగి టౌన్
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంలాంటిది. రూపాయి ఖర్చు లేకుండానే కంటి పరీక్షలు చేసి అక్కడికక్కడే వైద్యులు అద్దా లు ఇస్తున్నారు. నేను కంటి సమస్య తో చాలా ఇబ్బంది పడ్డా. ప్రస్తుతం తీసుకున్న అద్దాలతో చాలా మంచిగా కండ్లు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్కు ధన్యావాదాలు.
– మైసమ్మ ,శంకర్పల్లి పేదలకు ఎంతో ఉపయోగం
చూపు సరిగ్గా లేకపోవడంతో గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. వైద్యులు పరీక్షించి అద్దాలు ఉచితంగా ఇచ్చారు. ప్రైవే ట్ దవాఖానలో అయితే రూ. 2 వేల వరకు ఖర్చు అయ్యేది. ప్రభు త్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం బాగుంది. పేదలకు ఎంతో ఉపయోగం.
-లక్ష్మీబాయి, మద్దిమడుగుతండా, బొంరాస్పేట చూపు సరిగ్గా కనిపిస్తున్నది..
కంటి చూపు సరిగ్గా ఉంటేనే అన్ని పనులను చేసుకోవచ్చు. చూపు మందగిస్తే ఇబ్బందిగా ఉంటుంది. నాకు దూరం వస్తువులు సరిగ్గా కనిపించేవి కాదు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే ఆర్థిక స్థోమత లేకపోవడంతో కంటి చూపుపై అశ్రద్ధ చేశా. ప్రస్తుతం మా గ్రామంలో ఏర్పాటైన కంటి వెలుగు శిబిరంలో పరీక్షించిన వైద్యులు కంటి అద్దాలు ఇచ్చారు. అవి పెట్టుకోవడంతో చూపు సరిగ్గా కనిపిస్తున్నది.
-గున్నమ్మ, కౌడీడ్, కొడంగల్
అద్దాల పంపిణీ హర్షణీయం
‘కంటి వెలుగు’ నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్నది. చూపు సరి గ్గా లేని వారికి.. దూరం వస్తువులు కనిపించని వారికి గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లోని వైద్యులు పరీక్షించి.. అవసరమైన మందులు, కంటి అద్దాలను పంపిణీ చేయడం హర్షణీయం
-చంద్రకళ, ఎన్కతల గ్రామం