కడ్తాల్, డిసెంబర్ 30 : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహేందర్రెడ్డి అధ్యక్షతన 46 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లి చేయలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసమే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీవో, జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రంలో తాగునీటి అవసరమైన వాటర్ ట్యాంక్లను నిర్మిస్తామని తెలిపారు. పాలశీతలీకరణ కేంద్రం ఆవరణంలో రూ.48 లక్షలతో చేపట్టనున్న షాపింగ్ కాంప్లెక్స్కు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న పాలశీతలీకరణ కేంద్రానికి నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. అనంతరం స్థానిక నాయకులు, మహిళలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్లు కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, హరిచంద్నాయక్, భాగ్యమ్మ, సులోచన, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, శ్రీనివాస్రెడ్డి, మంజుల, ఉప సర్పంచ్లు రామకృష్ణ, జైపాల్రెడ్డి, అనిల్యాదవ్, ఎల్లాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండల కోఆర్డినేటర్ వీర య్య, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహాగౌడ్, నాయకులు రాజేందర్, సాయిలు, రాఘవేందర్, సాబేర్ పాల్గొన్నారు.