నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
కడ్తాల్, జనవరి 2 : ముఖ్యమంత్రి కేసీఆర్ను సోమవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కేసీఆర్కు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.100 కోట్లు మంజూరు చేయాలని, ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని సీఎంకు విన్నవించారు.
నియోజకవర్గానికి 6వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని, కడ్తాల్ చౌరస్తా నుంచి పడకల్ గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేయాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజన జనాభా ఉన్నదని, సమగ్ర గిరిజనాభివృద్ధి పథకంలో కల్వకుర్తికి రూ.250 కోట్లు కేటాయించాలని, కేఎల్ఐ ఎత్తిపోతల పథకం-డీ82లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ.27 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కల్వకుర్తి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, నిధుల విడుదలకై వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు.