కల్వకుర్తి, నవంబర్ 23: ముచ్చటగా మూడోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని కల్వకుర్తి పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 13వ వార్డులో పీఏసీసీఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చే సంక్షేమ పథకాల మానిఫెస్టో వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ ఓటు వేయాలని అభ్యర్థించారు.
కాం గ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే గారడీ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కల్వకుర్తి మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు ఇవ్వ డం వల్ల కల్వకుర్తి పట్టణం గణనీయంగా అభివృద్ధి సాధించిన విషయాలను గుర్తు చేశారు. మున్సిపాలిటీలోని హరిజనవాడలో బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షే మ పథకాలను వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని చౌదర్పల్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు లోడిగే తిర్పతయ్యయాదవ్ అన్నారు. వెల్దండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని చౌదర్పల్లి, నారాయణపూర్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా గురువారం నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రచార కరపత్రాలు పంచి పెట్టారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఎంజీ కాలనీతండాలో బీఆర్ఎస్ నాయకుడు తానేశ్ యాదవ్తో కలిసి గ్రామ సర్పంచ్ శంకర్నాయక్, వ్యవసాయ పొలాల వద్ద రైతులను కూలీలను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బాలు, చొక్కన్నపల్లి శ్రీనివాస్రెడ్డి, వెల్దండ ఎంపీటీసీ నిరంజన్, ఆనంద్, శంకర్, ప్రభాకర్, కృపానందం, రాము, అర్జున్, శేఖర్, రవి, బాలరాజు, చంద్రశేఖర్, వెంకటయ్య, ప్రసాద్, ఈదులపల్లి శ్రీనివాసులు, శ్రీకాంత్, రాజు, శివ, వెంకటయ్య, వెంకట్ముదిరాజ్, ఎంఎస్గౌడ్, నిరంజన్గౌడ్, మల్లయ్య, బాలకృష్ణ, సాయిలు, మట్టపర్వతాలు గౌడ్ పాల్గొన్నారు.
ఆమనగల్లు (మాడ్గుల), నవంబర్ 23: నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్ గల్లంతవడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు. మాడ్గుల మండలం సుద్దపల్లి, అసిరెడ్డి పల్లి నుంచి దాదాపు 100 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు చలికంటి ఆదిలక్ష్మీ ఆధ్వర్యంలో ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన బీజేపీ , కాంగ్రెస్ నాయకులు దాదాపు 30 మంది గురువారం ఆమనగల్లు ఏఎంసీ వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, ఎన్నికల ఇన్చార్జి గోళి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ గులాబీ కండువాలు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వనించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు శంకరగిరి మాన్యాలే దిక్కన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోని చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులకు నిద్ర కూడా పట్టడం లేదన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్రావు, ఏమిరెడ్డి జైపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, సర్పంచులు లక్ష్మణ్, సోన, ఎంపీటీసీలు దోనాదుల కుమార్, సరిత, మాడ్గుల మహిళా విభాగం అధ్యక్షురాలు చలికంటి అదిలక్ష్మి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, కోట శ్రీనివాస్, గుత్తి బాలస్వామి, రవి, నాయకులు కొమ్ము ప్రసాద్, తోట కృష్ణ, డేరంగుల వెంకటేశ్, చలీచీమల సతీశ్, సైదులు, వరికుప్పల గణేశ్, హైమద్, రేపని శివ, రేపని విజయ్, గణేశ్, రమేష్నాయక్, రైసల్నాయక్, వినోద్నాయక్ ఉన్నారు.