ఆదిబట్ల, జూన్ 4: కల్లుగీత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ అన్నారు. ఆదిబట్ల గ్రామంలో కల్లుగీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి జారి పడి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచి చనిపోయిన బుర్ర శంకరయ్య కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం రూ.25వేల టాటా కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని మృతుడి భార్య చంద్రకళకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వృత్తిదారులకు కోట్ల రూపాయల నిధులు చెల్లించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి గీతకార్మికుడికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుని మృతి చెందితే రూ.5లక్షల ఇన్సురెన్స్ అందేలా పాటుపడుతున్నదని పేర్కొన్నారు.
గ్రామాల్లో చెరువు, కుంటల గట్లపై ఈత వనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిదని తెలిపారు. గీతకార్మికులకు ద్విచక్రవాహనాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేసిందని అన్నారు. కార్యక్రమంలో గీతకార్మిక సంఘం నాయకులు కొత్త అశోక్గౌడ్, ఈసీ శేఖర్గౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్గౌడ్, కల్లుగీతకార్మిక సంఘం జిల్లాకార్యదర్శి బోయపల్లి సుధాకర్గౌడ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, సొసైటీ అధ్యక్షుడు యదయ్యగౌడ్, బొంగుళూరు సొసైటీ అధ్యక్షులు సత్తయ్యగౌడ్, పాపయ్యగౌడ్, ఇంజాపూర్గౌడ సంఘం అధ్యక్షులు యాదగిరిగౌడ్, నరేశ్గౌడ్ పాల్గొన్నారు.